దర్వాజ-హెల్త్&బ్యూటీ
Walk after eating:తిన్న వెంటనే కాసేపు బయట నడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చాలా మందే చెబుతుంటారు. అందుకే భోజనం చేసిన వెంటనే నడుస్తూ ఉంటారు. ఇలా నడవడం వల్ల తొందరగా జీర్ణం అవడంతో పాటుగా బరువు కూడా తగ్గుతామని అనుకుంటారు. కానీ ఇలా భోజనం చేసిన వెంటనే నడవడం అస్సలు మంచిది కాదట. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే తిన్న వెంటనే నడవకుండా కాసేపు కూర్చోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మనం తిన్న వెంటనే జీర్ణ వ్యవస్థ తన పనిని మొదలు పెడుతుంది. అప్పుడు శరీరం దానికి కావాల్సిన అధిక శక్తిని జీర్ణ వ్యవస్థకు అందిస్తుంది. సో ఆ సమయంలో నడవడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీరు ఖచ్చితంగా నడవాల్సిందే అనుకుంటే మాత్రం తిన్న ఒక అర్ధగంట తర్వాత నడవండి.

ఆ తర్వాత మీరు మెల్లిగా నడవొచ్చు. కానీ స్పీడ్ స్పీడ్ గా నడవడం మంచిది కాదు. అయితే తిన్న వెంటనే నడిస్తే మాత్రం జీర్ణ క్రియ పనితీరు నెమ్మదించడమే కాకుండా కాళ్లకు రక్త సరఫరా జరుగుందని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల తిన్నది తొందరగా జీర్ణం కాదు. అలాగే ఎసిడిటీ సమస్య కూడా వస్తుందట. అయితే తిన్న వెంటనే పడుకోవడం లేదా.. వజ్రాసనంలో కూర్చోవడం మంచిది. వీటి వల్ల పొట్టకు రక్త ప్రసరణ మంచిగా జరిగి జీర్ణం సాఫీగా అవుతుందట.
స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..
మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?