Malaria prevention precautions: మలేరియా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం మందికి మలేరియా వచ్చే ప్రమాదం ఉందనీ, ముఖ్యంగా పేద దేశాలలో నివసించే ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. మలేరియా బారినపడకుండా ముందేగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలేరియా బారినపడకుండా ముఖ్యంగా మూడు రకాల చర్యలు తీసుకోవండం గురించి చెబుతున్నారు.
ఆ మూడు రకాల నివారణ చర్యలు..
1. దోమలను అదుపు చేయడం: మలేరియా దోమలు కుట్టడం వల్ల సంక్రమిస్తుంది. కాబట్టి నివాస ప్రాంతాల్లో దోమలు లేకుండా చూసుకోవాలి. దోమల నివారణ చర్యలు చేపట్టాలి. మురుగు నీరు లేకుండా చూసుకోవాలి.
2. దోమలు మిమ్మల్ని కుట్టకుండా చూసుకోవడం: మలేరియా దోమలు కుట్టడం వల్ల సంక్రమిస్తుంది. కాబట్టి దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవాలి. దీని కోసం దోమ తెరలు వాడటం మంచిది. అలాగే, ఇంట్లోకి దోమలు రాకుండా అందుబాటులో ఉన్న మరిన్ని సాధానాలు ఉపయోగించుకోవాలి.
3. దోమకాటుకు గురైతే సరైన మందులు తీసుకోవడం: మలేరియా దోమలు కుట్టడం వల్ల సంక్రమిస్తుంది. కాబట్టి మలేరియా సంక్రమిస్తే.. సాధారణంగా జ్వరం ఉంటుంది. అలాగే, చలి అధికంగా పెడుతుంది. కీళ్ళ నొప్పులు, తలనొప్పి, వాంతులు, ఓపిక లేకపోవటం లేక మగతగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే…వెంటనే వైద్యులను సంప్రదించాలి. మలేరియా బారినపకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని మలేరియా సోకే ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల వారు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.