- కేజి టూ పీజి ఉచ్చిత విద్య కేవలం మాటలకే..
- జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
దర్వాజ, రంగారెడ్డి:
ఆడపిల్లల గౌరవాన్ని కాపాడటంలో టీఆర్ ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిదని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం, పడకల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలను జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ సందర్శించారు. పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉపధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అ తరువాత శిథిలావస్థలో ఉన్న టాయిలెట్లను పరిశీలించారు. వాటి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆ టాయిలెట్ల మార్పుకోసం విన్నూత్న నిరసన చేపట్టారు. అందులో భాగంగా టాయిలెట్ల పునరుద్ధరణ కోసం కార్యకర్తలతో కలిసి బిక్షటన చేశారు. గ్రామంలో తిరుగుతూ.. పిల్లల గౌరవం కోసం సాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజి టూ పీజి ఉచిత విద్య అనేది కేవలం మాటలకే అని అన్నారు. సర్కారు బడుల బాగుకోసం ప్రభుత్వం కృషి చేస్తలేదని తెలిపారు. స్కూళ్లకు అందాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి గతంలో చాలా సార్లు కలెక్టర్, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని తెలిపారు. కానీ వారు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

అందుకోసమే ఈ బిక్షాటన చేస్తున్నామని తెలిపారు. ఈ డబ్బులతోనైనా వాటిని బాగు చేయిస్తామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కండ్లు తెరవాలని కోరారు. మండలంలోని అన్ని పాఠశాలల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఆ స్కూళ్లనింటిని బాగు చేయించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. మండలంలోని స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు, ప్రజలతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు గోపాల్, పడకల్ ఎంపీటీసీ రమేష్, పెద్దురు ఎంపీటీసీ రఘు, సోనిలక్య నాయక్, సర్పంచులు జ్యోతయ్య, శ్రీశైలం, రఘుపతి, రాజు, కోప్షన్ మెంబర్ ఇమ్రాన్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్, నాయకులు కృష్ణ, శ్రీను, యువ నాయకులు విజయ్, మల్లేష్, సాయి, పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
టీవీ, మొబైల్స్.. డెంజర్లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!