Breaking
Sat. Jun 28th, 2025

ఘనంగా గూడూరులో బోనాల పండుగ

  • ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి

దర్వాజ-కొత్తూర్

ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా మండలంలోని గూడూరు గ్రామంలో  బోనాల జాతర సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలతో గ్రామ పరిసర ప్రాంతం అంతా కిక్కిరిసి పోయింది. అమ్మా సల్లంగ సూడు అంటు  అమ్మ వారికి బోనాలు సమర్పించి మొక్కులు మొక్కుకున్నారు.

ఈ బోనాల ఉత్సవానికి ముఖ్యఅతిథిగా తాజా మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండి అందరూ సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, తాజా మాజీ ఉపసర్పంచ్ దయానంద్ గుప్తా,మాజీ ఎంపిటిసి మోడీ దర్శన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సిద్దు గౌడ్, పెండ్లిమడుగు రాజు గౌడ్, గుండు ఆంజనేయులు,బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేష్,మహేందర్ రెడ్డి,బోకుల రాజు,నరసింహారెడ్డి, శ్రీను,శివరాజ్,జయేందర్ రెడ్డి,పాపిరెడ్డి, దామోదర్ రెడ్డి,నరేందర్ రెడ్డి, శ్రీరాములు,రాములు గౌడ్, సిద్దు,రాజు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By Shikar

Related Post