• పడకల్ సర్పంచ్ చౌటి రమేష్
దర్వాజ-రంగారెడ్డి
కరోనా పోరులో అందరూ కలిసి కట్టుగా పోరాడాలనీ, దీని కోసం అందరూ టీకాలు వేయించుకోవాలని పడకల్ గ్రామ సర్పంచ్ చౌటి రమేష్ అన్నారు. శుక్రవారం తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతిఒక్కరూ కోవిడ్-19 టీకాలు వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్పై భయాలు, అపోహలను వద్దనీ, అందరూ స్వచ్ఛందంగా టీకాలు తీసుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చౌటి రమేష్, ఉప సర్పంచ్ యాదమ్మ, గ్రామ వార్డు సభ్యులు పాండు యాదవ్, చెన్నయ్య, మురళీధర్ రెడ్డి, బురమోని శ్రీశైలం, శాంతమ్మ, బయ్యా కృష్ణయ్య, పడకల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీ. శ్రీశైలం యాదవ్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ జల్లెల రమేష్ యాదవ్, బర్ల శ్రీశైలం, గొల్సమ్ కృష్ణ, సీహెచ్. రాజు, జంగయ్య, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు