Breaking
Sat. Jun 28th, 2025

యువ‌త మేల్కోవాలి !

cyberabad police conducted awareness on online frauds and black magik at devuni padakal 3
cyberabad police conducted awareness on online frauds and black magik at devuni padakal 3
  • సైబ‌ర్ నేరాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గుండాలే : సీఐ జె.ఉపేందర్ రావు
  • యువ‌త… మీ త‌ల్లిదండ్రుల క‌ష్టాన్ని గుర్తుచేసుకోండి : ఎస్సై వరప్రసాద్
  • క‌ళాజాత బృందానికి గ్రామాధికారుల ధ‌న్య‌వాదాలు


ద‌ర్వాజ‌-రంగారెడ్డి

“గతేడాది కరోనా మరణాల కంటే రోడ్డు ప్రమాదాల మరణాలే అధికంగా చోటుచేసుకున్నాయి” అని ఆమ‌న‌గ‌ల్లు సీఐ జె.ఉపేందర్ రావు అన్నారు. అలాగే, సైబర్ నేరాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయనీ, సోష‌ల్ మీడియా మోసాల ప‌ట్ల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు. గురువారం సాయంత్రం త‌ల‌కొండ‌ప‌ల్లి ప‌రిధిలోని దేవుని ప‌డ‌క‌ల్ గ్రామంలో పోలీసు శాఖ అధ్వ‌ర్యంలో కళ‌జాత నిర్వ‌హించారు.

cyberabad-police-conducted-awareness-on-online-frauds-and-black-magik-at-devuni-padakal-9 యువ‌త మేల్కోవాలి !

ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మూడనమ్మకాలు, సామాజిక రుగ్మతల నిర్మూలన, సోషల్‌ మీడియా ద్వారా చోటుచేసుకుంటున్న మోసాలు, రోడ్డు ప్రమాదాలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు తదితర అంశాలపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించారు. క‌ళాబృందాల‌చే నిర్వ‌హించిన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా బాణామ‌తి (చేత‌బ‌డి, మంత్రాలు, మూడ‌న‌మ్మ‌కాలు), ఆన్‌లైన్ మోసాలు, యువ‌త త‌ప్పుదారి ప‌డుతున్న విష‌యాలు, రోడ్డు ప్రమాదాల గురించి క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో వివ‌రించారు.

సైబర్ నేరాలు పెరుగుతున్నాయ్.. మోసపోకండి !

cyberabad-police-conducted-awareness-on-online-frauds-and-black-magik-at-devuni-padakal యువ‌త మేల్కోవాలి !

సైబ‌రాబాద్ పోలీసు శాఖ అధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో ఆమ‌న‌గ‌ల్లు సీఐ ఉపెంద‌ర్ రావు మాట్లాడుతూ.. ఇదివ‌ర‌కు సాధార‌ణ కేసులు ఎక్కువ‌గా ఉండేవి కానీ నేడు సైబ‌ర్ నేరాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయ‌నీ, వీటిలో అత్య‌ధికం ఆర్థిక నేరాలు, మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు సంబంధించిన కేసులు ఉంటున్నాయ‌ని తెలిపారు. అలాగే, ఏడాది కాలంలో క‌రోనాతో చ‌నిపోయిన వారి కంటే రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల చ‌నిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటున్న‌ద‌ని తెలిపారు. రోడ్డు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సోష‌ల్ మీడియా, స్మార్టుఫోన్‌ల‌ను వ‌ల్ల కూడా కొంత మంది యువ‌త త‌ప్పుదోవ ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో యువ‌త భ‌విష్య‌త్తుపై దృష్టి సారించి ముందుకు సాగాల్సిన అవ‌స‌రం చాలా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. క‌రోనా దృష్ట్యా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం.. కరోనా జాగ్రత్తలు పాటించండి !

cyberabad-police-conducted-awareness-on-online-frauds-and-black-magik-at-devuni-padakal-1 యువ‌త మేల్కోవాలి !

త‌ల‌కొండ‌ప‌ల్లి ఎస్సై వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్లు అతిగా వినియోగిస్తూ.. యువ‌త త‌ప్పుదోవ ప‌డుతున్న‌ద‌ని తెలిపారు. విద్యార్థుల ప‌ట్ల గ‌త్త‌ర‌గా స్మార్ట్ ఫోన్లు మార‌య‌నీ, యువ‌త‌పై వారి త‌ల్లిదండ్రులు ఓ క‌న్నేసి ఉంచాల‌నీ, వారి విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాల‌ని సూచించారు. అలాగే, మైన‌ర్ల‌కు వాహ‌నాలు ఇవ్వ‌రాద‌నీ, రోడ్డు ప్ర‌మాదాల‌కు జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాలు, ర‌క్ష‌ణ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వంటి అంశాల‌ను వివ‌రించారు. అలాగే, నిరుద్యోగ యువ‌త‌కు పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించి ఉచితంగా అందిస్తున్న కోచింగ్ స‌దుపాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి యుత‌కు పిలుపునిచ్చారు.

SRISAILA-K-SARPANCH యువ‌త మేల్కోవాలి !

ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్పంచ్ కె. శ్రీ‌శైలం మాట్లాడుతూ.. మూఢ‌న‌మ్మ‌కాల‌ను వీడాల‌ని అన్నారు. తమ గ్రామ ప‌రిధిలో నేరాలు రేటు త‌క్కువ‌గానే ఉంద‌నీ, పోలీసుశాఖ వారి చ‌ర్య‌లు, స‌హ‌కారాన్ని కొనియాడారు. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి దేవుని ప‌డ‌క‌ల్ గ్రామంలో ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన పోలీసు శాఖ‌ వారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

tirupathaiah-padakal-up-sarpanch యువ‌త మేల్కోవాలి !

ఉప‌స‌ర్పంచ్ రాజ‌మోని తిరుప‌త‌య్య మాట్లాడుతూ.. మారుతున్న కాల‌నికి అనుగుణంగా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రావాల‌ని అన్నారు. క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో పోలీసుల స‌హ‌కారాన్ని కొనియాడారు. అలాగే, జాత‌ర సంద‌ర్భంగా క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తున్న ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

cyberabad-police-conducted-awareness-on-online-frauds-and-black-magik-at-devuni-padakal-7 యువ‌త మేల్కోవాలి !

మాజీ సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ.. సామాజిక రుగ్మతలను తరిమికొట్టాల్సిన అవసరముందని అన్నారు. కరోనా అధికమవుతున్నది కాబట్టి గ్రామస్తులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ కార్యక్రమం సందర్భంగా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సీఐ ఉపేందర్ రావు సందర్శించి.. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమ‌న‌గ‌ల్లు సీఐ ఉపేందర్ రావు, తలకొండపల్లి ఎస్సై వరప్రసాద్, దేవుని పడకల్ గ్రామ సర్పంచ్ కె.శ్రీశైలం, ఉపసర్పంచ్ రాజమోని తిరుపతయ్య, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ శంకర్, శంకర్ నాయక్, జినుకుంట్ల కృష్ణ‌ గౌడ్, రవి, కానుగుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

https://darvaaja.com/devuni-padakal-sri-venkateshwara-swamy-kalyanotsavam/
https://darvaaja.com/end-the-dowry-system/
https://darvaaja.com/holi-celebrations-india_happy-holi-2021-wishes-images-messages-greetings-whatsapp-instagram-facebook/
https://darvaaja.com/world-water-day-2021_india/

Related Post