దర్వాజ-రంగారెడ్డి
తలకొండపల్లి మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామలోని రైతులు తమ పంట పొలాలకు వెళ్లేదారిలో.. పెద్ద చెరువు నిండినప్పుడు దారికి అడ్డంగా నీరు చేరుతోంది. దీంతో అటుగా వెళ్లే రైతులు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఐదు నెలల పాటు ఉదయం పొలాలకు వెళ్లేప్పుడు, తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిటప్పుడు నీటితో తడిసి రావాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దేవునిపడకల్ గ్రామ ఉప సర్పంచ్ రాజమోని తిరుపతి, వార్డు మెంబర్లు ఏ.నర్సింహ్మ, జీ.గణేష్, ఏ, వెంకటేష్ లు కలిసి తమ సొంత డబ్బుతో ఆ దారిలో నీరు నిలిచే చోట నీరు వెల్లడానికి నీటి గొట్టాలను (పైపులను) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ దారి పనులు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.