కనుల పండువగా దేవునిపడకల్ శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి భక్తులు తరలి వచ్చారు. కరోనా మళ్లీ వ్యాపిస్తున్న సమయంలో అటు ఆఫీసర్లు, ఇటు లీడర్లు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునేలా చూశారు. దాంతో అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి.


దేవుని పడకల్ శ్రీవారి కళ్యాణంలో పాల్గొన్న పలువురు ముఖ్య అతిథులు జాతరను ఉద్దేశించి దర్వాజతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు వారి మాటల్లోనే..
దేవాలయ విస్తరణకు కృషి చేస్తా

కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయం, ఎంతో ప్రత్యేకత ఉన్న దేవుని పడకల్ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరుఫున అన్ని వసతులు కల్పిస్తాను. ప్రతి యేడు జరిగే జాతరకు నా సహాయ సహకారాలు ఉంటాయి. దేవాలయానికి కావలసిన వసతులు కల్పించడంలో ముందుంటా.. – జైపాల్ యాదవ్, ఎమ్మెల్యే, కల్వకుర్తి నియోజకవర్గం.
ఈ బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకం

పడకల్ గ్రామంలో కొలువైన శ్రీవారు అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నా. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు చాలా ప్రత్యేకం. కరోనా అధికమవుతోంది కాబట్టి.. అందరూ సమాజిక భౌతిక దూరం పాటిస్తూ.. కరోనాను తరిమికొట్టాలి.– నిర్మల శ్రీశైలం గౌడ్, ఎంపీపీ, తలకొండపల్లి.
నిబంధనలు పాటించినందుకు ధన్యవాదాలు

కరోనా నిబంధనలు పాటిస్తూ.. జాతర కార్యక్రమాలను జరిపినందుకు అందరికి ధన్యవాదాలు. అలాగే ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కోరుకుంటున్నా.. తలకొండపల్లి మండల ప్రజలందరూ మాస్కులు ధరించాలి. కోవిడ్-19 నిబంధనలు పాటించాలి. కలిసికట్టుగా కరోనాను అడ్డుకుందాం..– వరప్రసాద్, ఎస్సై, తలకొండపల్లి
సహకరిస్తున్న వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు

జాతర ఘనంగా జరిగేందుకు సహకరిస్తున్న వారందరికి ప్రత్యేక కృతజ్ఙతలు. మా ఊరి జాతరలో జరిగే కార్యక్రమాలను ప్రపంచం మొత్తం లైవ్ లో చూసే అవకాశాన్ని కల్పించినందుకు దర్వాజ వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు. – కాడమోని శ్రీశైలం, దేవుని పడకల్ సర్పంచ్
గ్రామస్తుల సహకారంతోనే..

జాతర ఇంత బాగా జరిగేందుకు కారణం గ్రామస్తులు. వారి సహకారంతోనే.. కరోనా కాలంలో కూడా జాతర కార్యక్రమాలను ఇంత బాగా చేయగలుగుతున్నాం. ఇలాగే అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నా.. – తిరుపతయ్య, దేవుని పడకల్ ఉప సర్పంచ్.
దర్వాజ లైవ్ కు ఆదరణ
దర్వాజ.కామ్ అందించిన జాతర లైవ్ కార్యక్రమాలకు భక్త జనం నుంచి మంచి ఆదరణ లభించింది. కరోనా కాలంలో శ్రీవారిని దర్శించుకోలేదని అనుకున్న ప్రతి ఒక్కరూ దర్వాజ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం అయిన లైవ్ ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈ లైవ్ ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు, లీడర్లు, ఆఫీసర్లు ఎంతో సంతోషపడ్డారు. మీరు కనుక ఆ లైవ్ ను మిస్ అయితే.. దర్వాజ యూట్యూబ్ ఛానెల్ లో జాతరకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు.
లైవ్ భలే ఉంది !


ప్రతి యేడాది ఎంతో ఘనంగా జరిగే దేవుని పడకల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కరోనా కారణంగా వెళ్లలేకపోతున్నాం. అయితే, జాతర కార్యక్రమాలను.. ముఖ్యంగా శ్రీవారి కళ్యాణం లైవ్ ప్రసారం చేయడంతో బ్రహ్మోత్సవాలు చూడలేకపోతున్నామనే భావన తొలగి పోయింది. జాతర లైవ్ కార్యక్రమాలు అందిస్తున్న దర్వాజ.కామ్ వారికి ధన్యవాదాలు.. ! – ప్రసాద్ (హైదరాబాద్).
శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, అమన్ గల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, యాట నర్సింహ్మ, దేవుని పడకల్ సర్పంచ్ కె.శ్రీశైలం, ఉప సర్పంచ్ రాజమోని తిరుపతయ్య, మాజీ సర్పంచ్ కె.శంకర్, శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్తలు లట్టుపల్లి లోహిత్ రెడ్డి, మధుసుదన్ రెడ్డి, అర్చకులు పరవస్తు గోపాల చార్యులు, శ్రీనివాస చార్యులు, రామా చార్యులు తదితరులతో పాటు భక్తజనం పాల్గొన్నారు. అలాగే, తలకొండపల్లి ఎస్సై వరప్రసాద్, వారి బృందం జాతర సందర్భంగా శాంతి భద్రతలు కాపాడటం, కోవిడ్-19 నిబంధనల అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ ఫొటోలు