- క్రీడలు మానసిక ధృడత్వానికి సాయపడుతాయి
- జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారి
ఓడినప్పుడే గెలవాలనే కసీ పుడుతుందని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టీ. ఆచారి అన్నారు. 15వ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు రంగారెడ్డి జిల్లాలోని దేవుని పడకల్ గ్రామంలో జరిగాయి. చివరి రోజు జరిగే కార్యక్రమానికి టీ. ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మానసికంగా ఎదిగేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వాల సహకారం లేకుండా ఇంతపెద్ద ప్రోగాంలను నిర్వహిస్తున్నందుకు ఆర్గనైజర్లను అభినందించారు. ఇలాంటి పోటీలు మరిన్ని జరపాలని సూచించారు. వ్యక్తిగతంగా ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం సీఐ ఉపేందర్ మాట్లాడుతూ.. క్రీడల్లో మంచిగా రాణించి.. దేశం తరుఫున ఆడాలని సూచించారు. క్రీడలు కేవలం ఉత్తేజనికే కాదని పేర్కొన్నారు. పోలీసు శాఖలోకి రావాలనుకునేవారికి స్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం ఎస్సై వరప్రసాద్ మాట్లాడుతూ.. యువత క్రీడల్లో రాణిస్తే.. ఎంతో మంచిగుంటుందని తెలిపారు.

అలాగే, మాజీ సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ.. ఏదైనా సాధించాలనే తపనతో యువత ముందుకుపోవాలని సూచించారు. ఆటలతో పాటుగా చదువు కూడా ఎంతో ముఖ్యమని వెల్లడించారు. అనంతరం ఉపసర్పంచ్ రాజమోని తిరుపతి మాట్లాడుతూ..దాతలు ముందుకొస్తే.. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంజునాథ ట్రాన్స్పోర్ట్ ఓనర్ జీ.మహేష్ మాట్లాడుతూ.. జాతర సందర్భంగా నిర్వహించిన క్రీడలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. పడకల్ గ్రామ యువత రానున్న కాలంలో క్రీడల్లో మంచి పేరు సంపాదిస్తారని తెలిపారు.

అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఇందులో మొదటి బహుమతిని పడకల్ టీం గెలుచుకుంది. రెండో బహుమతిని ఆర్ కే టీం హైదరాబాద్, మూడో బహుమతిని శూభాన్ పూర్. నాలుగో బహుమతి దేవుని పడకల్ సొంతం చేసుకుంది. కార్యక్రమంలో కానుగుల మల్లేష్, రాము, సత్యం, లక్ష్మయ్య, రవి, కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు.