రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలో ప్రతి యేడాది శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి గ్రామస్తులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రజలందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని ఆహ్వానం పలుకుతున్నారు.

దీనిలో భాగంగా గురువారం నాడు గ్రామస్తులు పలువురు ప్రజా ప్రతినిధులను కలిసి జాతర ఆహ్వాన పత్రికలు అందించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర సంబంధిత కార్యక్రమాలను గురించి ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవునిపడకల్ గ్రామస్తులు రాజమోని తిరుపతి, కుమ్మరి మల్లేష్, అంబటి నర్సింహ్మ, గుంటి గణేష్, ఏ.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకత కలిగిన ఏకైక దేవాలయం

కాగా, దేవుని పడకల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ అలమేలుమంగా, గోదా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం రాష్ట్రంలోని అతి ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఏకశిలలో శ్రీదేవి, భూదేవి, విశ్వక్షేణుని సమేతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడవాహనంపై కొలువుదీరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక అతి పురాతన దేవాలయం ఇది.

ఈ నెల 27 (మార్చి 27 శనివారం) నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమై వారం రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ జాతరకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి ప్రజలు తరలివస్తారు.
కరోనా లాక్డౌన్… కన్నీటి దృశ్యాలు !
సైలెంట్ కిల్లర్.. రోజు 40 వేల మంది బలి !
సమ్మర్ స్పెషల్.. పచ్చిమామిడి కాయ జ్యూస్ !
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..