Breaking
Sat. Jun 28th, 2025

తుంపర సేద్య పరికరాల పంపిణీ

దర్వాజ-సిద్దిపేట

Nangunoor: సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలంలోని ఘ‌న‌పూర్ గ్రామంలో 52 మంది రైతులకు శుక్ర‌వారం తుంపర సేద్య పరికరాలను మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంగునూర్ పిఎసిఎస్ చైర్మ‌న్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం బలోపేతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కృషి చేస్తున్నార‌ని అన్నారు. రైతుల‌ను ప్రోత్సహించేలా మ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. దేశంలోని గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, సిఎం కెసిఆర్ నేతృత్వంలో ఒక్క యూనిట్ కు రూ.20 రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఉచితంగా కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు.మ‌న మంత్రి హ‌రీష్ రావు మ‌న నియోజ‌కవ‌ర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అనంత‌రం నంగునూర్ మండ‌ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోమిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటికే నంగునూర్ మండ‌ల పరిధిలోని వేలాది మంది రైతులకు తెరాస ప్ర‌భుత్వం సేద్య పరికరాలు పంపిణీ చేసింద‌నీ, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు ఆరుతడి, కమర్షియల్ పంటలు పండించి లాభాలు పొందాలని కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశ్యంతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అలాగే.. మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సును కోరే ఏకైక ప్ర‌భుత్వం మ‌న తెరాస ప్ర‌భుత్వమ‌ని, రైతులు సంప్ర‌దాయ వ్య‌వ‌సాయమే కాకుండా..సెరి కల్చర్, ఆయిల్ ఫామ్, వాణిజ్య‌ పంటలు పండించాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో నంగునూర్ పిఎసిఎస్ చైర్మ‌న్ కోల రమేష్ గౌడ్, మాజీ నంగునూర్ మండ‌ల మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి,నంగునూర్ మండ‌ల మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ రాగుల సార‌య్య‌, ప‌బ్బ‌తి రాజిరెడ్డి, రైతు బంధు అధ్య‌క్షుడు బి.కిష్టారెడ్డి, గ్రామ సర్పంచ్ బ‌త్తుల ర‌జిత‌- తిరుప‌తి,ఉప సర్పంచ్ లు, తెరాస నాయకులు, రైతులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Post