తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కేశంపెట మండలంలోని చౌలపల్లి (తూర్పు) గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నాడు ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యాకూబ్, డేవిడ్, శేఖర్, అంజనేయులు, అంజయ్య (టీచర్)లు హాజరయ్యారు.
జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహాకులు మాట్లాడుతూ.. క్రికెట్ పై ఉన్న మక్కువతో పాటు పల్లెటూర్లలోనూ నైపుణ్యం కలిగిన ఎందరో క్రీడాకారులు ఉన్నారనీ, వారి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో టాప్-3లో నిలిచిన జట్లకు బహుమతులు ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు టోర్నమెంట్ పాల్గోనడానికి రావాలని పిలుపునిచ్చారు.
కాగా, ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు యూ.జైపాల్, ఎస్ శ్రీను, ఎం శ్రీను, టీ క్రిష్ణ, పి రజినికాంత్, గ్రామస్తులు, ఇతర గ్రామాలకు చెందిన క్రికెట్ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.
ఒక్కరోజే 1.26 లక్షల మందికి కరోనా
లింగ సమానత్వం ఇప్పట్లో జరగనట్టే !