దర్వాజ-రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా కేశంపెట మండలంలోని చౌలపల్లి (తూర్పు) గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా కొండరెడ్డి పల్లి క్రికెట్ టీమ్ నిలిచింది. కొండరెడ్డి పల్లి, చౌలపల్లి గ్రామాల క్రికెట్ టీమ్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కొండరెడ్డి పల్లి టీమ్ విజేతగా నిలువగా, చౌలపల్లి జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వాహకులు బహుమతుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. టోర్నమెంట్ విజయవంతంగా కొనసాగిన నేపథ్యంలో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమలో నిర్వాహకులు యూ.జైపాల్, ఎస్ శ్రీను, ఎం శ్రీను, టీ క్రిష్ణ, పి రజినికాంత్, ఆంజనేయులు, గ్రామస్తులు, ఇతర గ్రామాలకు చెందిన క్రికెట్ జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు.

