- శోభాయమానంగా.. నిమర్జనం
దర్వాజ- నంగునూర్: ‘గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ , ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో నంగునూర్ గ్రామ వీధులు మారుమోగాయి. నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలు అందుకున్న గణనాథులు ఆదివారం నిమజ్జనానికి తరలాయి. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, డీజే పాటలు, యువతియువకుల కేరింతలు, చిన్నారుల చిందుల మధ్య వినాయకుడి శోభాయాత్ర హుషారుగా సాగింది. నీ చల్లని చూపులతో మమ్ముల్ని దీవించు దేవాదేవా.. బై బై వినాయకా.. అంటూ భక్తులు వీడ్కోలు పలికారు.

ఆకట్టుకున్న శోభాయాత్ర..
నంగునూర్ మండల కేంద్రంలోని వివేకానంద యూత్ అసోియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన సిద్దివినాయకుడి నిమజ్జన శోభాయాత్ర పలువురిని ఆకట్టుకుంది. యువతులు, మహిళలు సంప్రదాయబద్దంగా కోలాటం ఆడుతూ.. నృత్యాలు చేశారు. యువకులు డీజే పాటలకు మాస్ స్టెప్పులేస్తూ.. కేరింతలు కొడుతూ హుషారుగా శోభ యాత్ర నిర్వహించారు. చిన్నపెద్ద అనే తేడా లేకుండా అందరూ నృత్యాలు చేస్తూ.. సెల్ఫీల్లో బంధిస్తూ సంతోషంగా గడిపారు.
