ఉపాధి హామీ చట్టం పనులపై అవగాహన సదస్సు
దర్వాజ, రంగారెడ్డి:
ఉపాధి హామీ పనులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రమేష్ అన్నారు. శనివారం తలకొండపల్లి మండలంలోని పడకల్ లో ఉపాధి హామీ చట్టం పనుల గురించి అవగాహ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ పలు విషయాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అలాగే ఆవుల షెడ్, మేకల షెడ్, నీటి నిలువ గుంతలు, కూరగాయల తోటల పందిరి, బీడు భూముల చదును మెదలైన వాటి గురించి తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీముల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సెక్రటరీ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ మహిళలు, యువకులు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
టీవీ, మొబైల్స్.. డెంజర్లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!
అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !
మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771
Share this content: