Loading Now
opposite blow to TRS1

చింతకానిలో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ‌!

  • సీపీఐలో చేరిన 50 టీఆర్ ఎస్ పార్టీ కుటుంబాలు

ద‌ర్వాజ‌-ఖ‌మ్మం
చింతకాని మండల‌ పరిధిలో టీఆర్ ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆదివారం మండల పరిధిలోని బస్వాపురంలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి సుమారు 50 కుటుంబాలు సీపీఐ పార్టీలో చేరాయి. ఈ కార్య‌క్ర‌మం సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. ఆయ‌న పార్టీ కండువా కప్పి ఆ కుటుంబాల‌ను సీపీఐలోకి ఆహ్వానించారు.

అనంతరం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో సాంబశివరావు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఉద్యమ ద్రోహుల చేతుల్లోకి పోయింద‌ని అన్నారు. బూటకపు మాటల‌తో కేసీఆర్ అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడ‌ని విమ‌ర్శించాడు. టీఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడు యేండ్ల‌నా ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌ని అన్నారు. నిధులు నాయకుల జేబుల్లోకి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికే వ‌చ్చాయ‌ని విమ‌ర్శించాడు. కరోనా వ‌ల‌న‌ రోడ్డున ప‌డ్డ కుటుంబాల‌ను ఆదుకోవ‌డంలోకూడా టీఆర్ ఎస్ విఫ‌లం అయ్యింద‌ని తెలిపారు.

ఇప్ప‌టికైనా ప్రజ‌లు టీఆర్ ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల‌ని కోరారు. సమస్యల మీద పోరాటాలు చేస్తున్న సీపీఐలో చేరుతున్న వారంద‌రికీ అభినందనలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి హేమంతరావు, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పోటు ప్రసాద్, ప‌లువురు నాయకులు పాల్గొన్నారు.

మగువకు మరణ సంకెళ్లు.. తొలగేదెప్పుడు ?

మ‌నం మారేదెప్పుడు ?

ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771

Share this content:

You May Have Missed