దర్వాజ- నంగునూర్: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయూనేని నంగునూర్ మండల అధ్యక్షులు పీఆర్టీయూ పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం నంగునూర్ మండల పరిధిలోని పాలమాకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ మండల అధ్యక్షులు పార్థసారథి, సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నో క్లిష్టమైన సమస్యల పరిష్కరంలో ప్రభుత్వాన్ని ఒప్పించి.. మెప్పించిన ఘనత పీఆర్టీయూకే దక్కిందన్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి కలిశారనీ, ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, రేషనల్లైజేషన్, 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ విధానం, స్పౌస్ వంటి పలు సమస్యలపై చర్చించారని తెలిపారు. మంత్రిగారు కూడా సానుకూలంగా స్పందించారనీ, అతి త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుటకు పీఆర్టీయూ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగునూర్ మండల అధ్యక్షులు పీఆర్టీయూ పార్థసారథి, మండల ప్రధాన కార్యదర్శి పి నరేష్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి. రజినీకాంత్ రాష్ట్ర నాయకులు కె. రవి, కె. శ్రీశైలం, శనిగరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.