దర్వాజ-కొత్తూర్
కొత్తూర్ మండల కేంద్రంలో శనివారం జనసంఘ్ వ్యవస్థాపకులు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘ నంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, బీజేపీ కొత్తూర్ మండల అధ్యక్షులు మంగలి రమేష్, మున్సిపాలిటీ అధ్యక్షులు నాగరాజు చారి, బీజేపీ కొత్తూరు మండల ప్రధాన కార్యదర్శి శివలింగం , బీజేవైఎం కొత్తూరు మండల అధ్యక్షులు అంబటి శ్రీశైలం ,బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్,బీజేపీ పార్టీ శ్రేణులు డా. శ్యాం ప్రసాద్ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షులు అంబటి శ్రీశైలం మాట్లాడుతూ… సమైఖ్య భారతావని కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు. ఆనాడు దేశ విభజను ముఖర్జి వ్యతిరేకించారన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని అంటూ ఏక్ భారత్ అనే నినాదంతో అందరిని ఏకతాటిపై తీసుకురావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు.