Loading Now

బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా శనిగరం నవీన్

సిద్దిపేట జిల్లా బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా నంగునూరు మండల కేంద్రానికి చెందిన శనిగరం నవీన్ కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం నాడు సిద్దిపేట బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శనిగరం నవీన్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు న్యాయ పరమైన సమస్యలపై అండగా ఉంటానని పేర్కొన్నారు. తనకు బాధ్యతను అప్పగించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డికి, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంగునూరు మండల బీజేపీ అధ్యక్షులు బెదురు కుమారస్వామి, చిన్నకోడూరు మండల అధ్యక్షులు పిట్ట పర్శరాములు, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షులు మల్లమ్మగారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

You May Have Missed