Breaking
Sat. Jun 28th, 2025

గణపయ్యా..దీవించయ్యా..

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలోని ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ యూత్ ఆధ్వర్యంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం భ‌క్తుల‌కు అన్న‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా పీఏసీఎస్ చైర్మెన్ కోల ర‌మేశ్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి లు హాజ‌ర‌య్యారు. తొలుత వినాయ‌క మండపంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, స్వామి వారి తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. ఆ యూత్ స‌భ్యులు ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు భోజ‌నాలు వడ్డించారు. ఈ క్ర‌మంలో యూత్ స‌భ్యులు వారిని శాలువలు క‌ప్పి ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కోల ర‌మేశ్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి, తెరాస గ్రామశాఖ అధ్య‌క్షులు ఉల్లి మ‌ల్ల‌య్య, ర‌చ్చ సిద్దు, ప్రొఫెస‌ర్ జ‌యశంక‌ర్ యూత్ స‌భ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Post