దర్వాజ-విజయవాడ
AP 10th Exam Result 2023: ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫలితాల కోసం విద్యార్థులు results.bse.ap.gov.in. వెబ్ సైన్ ను సందర్శించాలని సూచించారు.
ఏపీ పది ఫలితాల కోసం క్లిక్ చేయండి.. results.bse.ap.gov.in..
పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం 5 శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా (87.4 శాతం ఉత్తీర్ణత) మొదటి స్థానంలో నిలవగా, నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 95.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
కాగా, ఏపీలో 3,349 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు.. ఏప్రిల్ 03 నుంచి 18 వరకు నిర్వహించారు. మొత్తం 6,64,152 మంది విద్యార్థులు ఏపీ పది పరీక్షలు రాశారు.
మీ ఫలితాలు చెక్ చేసుకోవడానికి ఇలా చేయండి..
- పదో తరగతి పరీక్ష ఫలితాలు కోసం BSEAP అధికారిక సైట్ bse.ap.gov.in లోకి వెళ్లండి.
- హోమ్ పేజీలో మీకు ఏపీ పదో తరగతి ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి
- ఫలితాల పేజీలో మీ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయండి.
- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీకు మీ ఫలితాలు కనిపిస్తాయి.
- ఫలితాల పేజీని మీరు డౌన్ లోడ్ లేదా ఫ్రింట్ తీసుకోవచ్చు.