దర్వాజ-క్రీడలు
ఆసియా కప్ 2022 : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ 2022లో నేడు (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్నక్రికెట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో పాక్ తక్కువ స్కోర్ కే కుప్పకూలింది. భారత బౌలర్లు రాణించడంతో పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటి ఇన్నింగ్స్ బ్యాంటింగ్ కు దిగిన పాకిస్థాన్ 3వ ఓవర్ లో మొదటి వికెట్ (బాబర్) కోల్పోయింది. 19.5 ఓవర్లలో147 పరుగులకు ఆలౌట్ అయింది. రిజ్వాన్ (43 పరుగులు), ఇఫ్తికార్ అహ్మద్ (28) బ్యాటింగ్ లో రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా, హర్ధిక్ పాండ్యా 3, హర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నారు.