కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం

Telangana cm Revanth Reddy

🔸తెలంగాణకు న్యాయం జరిగేలా బడ్జెట్ లో సవరణలు చేయాలని విజ్ఞప్తి

దర్వాజ-హైదరాబాద్

కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్ లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది.

అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంలోని అంశాలు..

“డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించిందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపిందని తెలిపింది.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం కోరటంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించారని తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించిందని తెలిపింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

Read More

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి

Budget 2024-25 : ధ‌ర‌లు త‌గ్గేవి ఏమిటి? పెరిగేవి ఏమిటి?

ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌ల‌కు పింఛన్.. తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

Shami-Sania : సానియా మీర్జాతో పెళ్లిపై స్పందించిన ష‌మీ..

Related Post