• వైసీపీ అభ్యర్థి సుధకు 1,12,072, బీజేపీ అభ్యర్థికి 21,661 ఓట్లు
దర్వాజ-అమరావతి
badwel election :ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. గతంలో ఏపీ సీఎం జగన్ సాధించిన మేజారిటీ రికార్డును బద్దలు కొడుతూ.. వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. మొత్తం ఓట్లు 1,46,545 ఉండగా, వాటిలో వైసీపీ అభ్యర్థికి రికార్డు స్థాయిలో 1,12,072 ఓట్లు పడ్డాయి. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థికి 21,661 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 6,217, నోటాకు 3,629 ఓట్లు పడ్డాయి.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ.. వైఎస్ జగన్ రికార్డును బద్దలు కొట్టారు. సుధ 90,411 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందిని సంగతి తెలిసిసిందే. ఇక ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పోటీ చేయకపోవడంతో ఆ ఓట్లు బీజేపీకి పోల్ అయినట్టుగా తెలుస్తోంది.