దర్వాజ-న్యూఢిల్లీ
Eid ul-Adha: దేశవ్యాప్తంగా నేడు ముస్లింలు బక్రీద్ పండుగ (ఈద్ ఉల్-అధా)ను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ బక్రీద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. మానవజాతి మంచి కోసం సామూహిక శ్రేయస్సు, స్ఫూర్తిని మరింతగా పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి పండుగ ప్రతి ఒక్కరినీ ప్రేరేపించాలని ఆకాంక్షించారు.
ముస్లింలు జరుపుకునే ఈ పండుగ దేవునికి విధేయత చూపే త్యాగ స్ఫూర్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఈద్ ముబారక్ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈద్-ఉల్-అధా శుభాకాంక్షలు. ఈ పండుగ మానవజాతి మంచి కోసం సామూహిక శ్రేయస్సు, శ్రేయస్సు స్ఫూర్తిని పెంపొందించే దిశగా పని చేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.
Eid Mubarak! Greetings on Eid-ul-Adha. May this festival inspire us to work towards furthering the spirit of collective well-being and prosperity for the good of humankind.
— Narendra Modi (@narendramodi) July 10, 2022