Loading Now
rape, murder, Dalit sisters, Lakhimpur Kheri, Uttar Pradesh, police, అత్యాచారం, హత్య, దళిత సోదరీమణులు, లఖింపూర్ ఖేరీ, ఉత్తరప్రదేశ్, పోలీసులు,

Balasore: త‌ంత్రాలు.. మాయ మాట‌ల‌తో.. ఓ మ‌హిళ‌పై 79 రోజులుగా అత్యాచారం.. !

దర్వాజ-భువనేశర్వర్

Odisha : దంప‌తుల మ‌ధ్య మొద‌లైన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పి ఓ తాంత్రికుడు.. ఓ మ‌హిళ‌ను బంధించి… ఆమె మైన‌ర్ కొడుకు ముంద‌రే 79 రోజులుగా లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం.. ఒడిశాలోని బాలాసోర్ లో నివాస‌ముంటున్న ఓ జంట 2017లో పెండ్లి చేసుకుంది. కొన్ని రోజుల వ‌ర‌కు వీరి కాపురం సాఫీగానే సాగింది. కొద్ది రోజుల త‌ర్వాత అత్త‌మామ‌ల నుంచి వ‌ర‌క‌ట్న వేధింపులు, భ‌ర్త నుంచి హింస స‌ద‌రు మ‌హిళ‌కు ఎదురైంది. ఈ వివాదాలు మ‌రింత పెరుగుతుండ‌టంతో ఓ మాంత్రికుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లారు.

తాంత్రికుడు వారికి మాయ‌మాట‌లు చేబుతూ.. ఆమెకు దోషాలు ఉన్నాయ‌నీ, వాటిని తొల‌గించ‌డానికి ఇక్క‌డే కొన్ని రోజులు ఉంచాల‌ని చెప్పాడు. దీనికి మ‌హిళ నిరాక‌రించింది కానీ త‌న భ‌ర్త‌, అత్త‌మామ‌లు అక్క‌డే ఉంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆమె తినే ఆహారంలో తెలియ‌కుండా మ‌త్తుమందు క‌లిపి పెట్టారు. బాధిత మ‌హిళ‌ సృహ తప్పి పడిపోయాక ఆమెను అక్కడే వదిలేసి వారు వెళ్లిపోయారు. కొన్ని నెల‌లుగా బాధిత మహిళ ఆ తాంత్రికుడు చోట ఉంది. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ‌ను గ‌దిలో బంధించి నిత్యం ఆమె రెండేండ్ల కొడుకు ముంద‌టే లైంగిక‌దాడికి పాల్ప‌డుతూ వ‌స్తున్నాడు. 79 రోజులుగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఎట్ట‌కేల‌కు బాధితురాలు అక్క‌డి నుంచి త‌ప్పించుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Share this content:

You May Have Missed