Breaking
Sat. Jun 28th, 2025

Hyderabad: తెలంగాణ స‌ర్కారుపై NHRCకి ఫిర్యాదు

బండి సంజ‌య్, బీజేపీ, ఆర‌వింద్, టీఆర్ఎస్, తెలంగాణ‌, హైదరాబాద్, Bandi Sanjay, BJP, Arvind, TRS, Telangana, Hyderabad,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana: తెలంగాణ స‌ర్కారుపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్.. జాతీయ మాన‌వ హ‌క్కుల కమిష‌న్ కు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్‌కార్డులు, కొత్త రేషన్‌కార్డుల జారీకి రూపొందించిన నిబంధనలపై కమిషన్‌ విచారణ జరిపించాలని కోరారు. రేషన్‌కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్‌కార్డులు జారీ చేసేలా కమిషన్ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

Related Post