Breaking
Sat. Jun 28th, 2025

thunderstorm: పిడుగుపాటుతో 17 మంది మృతి !

Bihar thunderstorm, Bihar , 17 killed, CM Nitish Kumar, ex-gratia, thunderstorms, Disaster Management Department,, బీహార్, పిడుగు, 17 మంది మృతి, భారీ వ‌ర్షాలు, రుతుప‌వ‌నాలు, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగం, తుఫాను, ఎక్స్ గ్రేషియా , monsoon , ఐఎండీ, IMD

ద‌ర్వాజ‌-పాట్నా

Bihar thunderstorm 17 killed: పిడుగుపాటుతో ఆదివారం బీహార్‌లో 17 మంది మ‌ర‌ణించారు. ప‌లువురు గాయ‌ప‌డ్డార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్‌ కుమార్.. పిడుగుపాటుతో 17 మంది మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌.. “ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా భాగల్‌పూర్‌లో 3, వైశాలిలో 3, ఖగారియాలో 2, కతిహార్‌లో 1, సహర్సాలో 1, మాధేపురాలో 1, బంకాలో 2 మరియు ముంగేర్‌లో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. చనిపోయిన వారందరికీ తక్షణమే రూ. 4 లక్షలు అందజేస్తాం” అని ట్వీట్ చేశారు.

ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పిడుగుపాటుకు గురికాకుండా ఉండేందుకు విపత్తు నిర్వహణ శాఖ ఇచ్చిన సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో ప‌లు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు ఏపీ, తెలంగాణ‌ల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ విభాగం అంచనా వేసింది.

Related Post