దర్వాజ-న్యూఢిల్లీ
paddy procurement : వరి సాగు, ధాన్యం కొనుగోలు అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటును పెంచాయి. అధికారి పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం ఇదే అంశాలను ఆసరగా చేసుకుని ధర్నాలకు దిగడం రైతులతో పాటు తెలంగాణ ప్రజానీకంలోనూ గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఎలాగైనా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ గురువారం హైదరాబాద్లో ధర్నాకు దిగి.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో బియ్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ.. బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని తెలిపింది. ఈ సీజన్లో 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపామని పేర్కొంది. గతంలో 44.7 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. దేశంలో బాయిల్డ్ రైస్కు డిమాండ్ లేదని తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని ఇప్పటికే తెలంగాణకు చెప్పామని కేంద్రం వెల్లడించింది.
ఇదివరకు తాము చెప్పింన దానికి తెలంగాణ సర్కారు అంగీకరించిందని కూడా ప్రధాని మోడీ సర్కారు పేర్కొంది. అయితే, సీఎం కేసీఆర్.. రైతులు, పార్టీ కార్యకర్తలందరితో కలిసి మహాధర్నా దిగడం.. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన కొద్ది గంటల్లోనే కేంద్రం ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగవుతోందని.. పంట మార్పిడి అనివార్యమని కేంద్రం తేల్చిచెప్పింది.
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..
Nidhhi Agerwal : అమ్మో నిధి ఏంటి వైట్ కలర్ డ్రెస్ లో ఏంజెల్ లా మారింది?
ఈ పండుతో హార్ట్ ఎటాక్ కు చెక్ పెట్టొచ్చా?
Poorna : సారీ హొయలతో ఆహా అనిపిస్తున్న పూర్ణ..
కంటినిండా నిద్రపోతే పొట్ట కరుగుతుందా?
E-Shram: అసంఘటిత కార్మికుల్లో 20% రిజిస్ట్రేషన్
తొందరగా అలిసిపోయి, నీరసంగా అనిపిస్తోందా.! అయితే మీకు ఈ సమస్య ఉన్నట్టే..