Chandrababu arrest: దీక్ష శిబిరంలోనే కుప్ప‌కూలి టీడీపీ మ‌హిళా నేత మృతి

Chikkala Satyavathi , TDP

ద‌ర్వాజ‌-కాకినాడ‌

Chandrababu arrest: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేప‌థ్యంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళ‌న‌కు దిగాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలోనే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కాకినాడ నగర మహిళా విభాగం అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి బుధవారం కాకినాడలో రిలే నిరాహారదీక్ష శిబిరంలో గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కాకినాడలో టీడీపీ నేతలు రిలే నిరాహారదీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ కాకినాడ నగర ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, శ్రీమతి సత్యవతి బుధవారం ఇతర మద్దతుదారులతో కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొని కుప్పకూలిపోయారు.

శ్రీమతి సత్యవతిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, అప్ప‌టికే ఆమె చ‌నిపోయింద‌ని వైద్యులు తెలిపారు. నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించడంలో ఆమె చాలా కీల‌కంగా ఉన్నార‌ని శ్రీ వెంకటేశ్వరరావు అన్నారు.

Related Post