దర్వాజ-ఛత్తీస్గఢ్
Chhattisgarh Election: ఛత్తీస్గఢ్లోని 70 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్లో ఉదయం 11 గంటల వరకు ఛత్తీస్గఢ్లో 19.65% ఓటింగ్ నమోదైంది.
రోడ్డు లేదనీ.. ఓటు వేయడం లేదు..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని మస్తూరి నియోజకవర్గంలోని పోలింగ్ నంబర్ 146, పోలింగ్ నంబర్ 143లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. రెండు బూత్లలో కలిపి మొత్తం 2160 మంది ఓటర్లు ఉన్నారు. ప్రజలు ఒక్క ఓటు కూడా వేయలేదు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు గ్రామస్తులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్థులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామ పంచాయతీ మాణిక్పూర్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామనికి రోడ్డు లేదనీ, ఊర్ల సౌకర్యాలు అంతంత మాత్రమేననీ, సర్కారు పట్టించుకోవడం లేదని నినదిస్తూ ఓటు వేయలేదు.
కోర్బాలోనూ ఓటింగ్ బహిష్కరణ
కోర్బాలోని కట్ఘోరా మున్సిపాలిటీ ఏరియాలోని వార్డ్ నంబర్ 11లోని రహ్మానియా ప్రాంతంలోని వార్డు వాసులు ఓటింగ్ను బహిష్కరించారు. డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యల కారణంగా ఓటింగ్ రోజున వార్డు వాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్డులో దాదాపు 900 మంది ఓటర్లు ఉన్నారు. పలుమార్లు మున్సిపాలిటీకి ఫిర్యాదు చేసినా నేటికీ పట్టించుకోలేదని వార్డు వాసులు చెబుతున్నారు. దీంతో వార్డు వాసుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు.