దర్వాజ-అంతర్జాతీయం
ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య సరిహద్దులో జరిగిన పోరులో మంగళవారం సుమారు 100 మంది సైనికులు మరణించారు. ఇరువైపులా దాడులు దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య విస్తారమైన శత్రుత్వాల భయాన్ని కలిగించాయి. వివరాల్లోకెళ్తే.. అర్మేనియా, అజర్బైజాన్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 99 మంది సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియా కథనలు పేర్కొన్నాయి. ఆర్మేనియా తమ 49 మంది సైనికులను కోల్పోయిందని నివేదించగా, రెండు దేశాల మధ్య జరిగిన ఘోరమైన సరిహద్దు ఘర్షణలో కనీసం 50 మంది తమ సైనికులు మరణించారని అజర్బైజాన్ తెలిపింది.
అర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, అర్మేనియన్ భూభాగంలోని అనేక విభాగాలలో అజర్బైజాన్ దళాలు ఆర్టిలరీ బారేజీ, డ్రోన్ దాడులను పాల్పడటంతో అర్ధరాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. పగటిపూట షెల్లింగ్ తీవ్రత తక్కువగా ఉందని, అయితే అజర్బైజాన్ దళాలు అర్మేనియన్ భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అజర్బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ.. సోమ, మంగళవారం ప్రారంభంలో అర్మేనియా దాడులకు ప్రతిస్పందిస్తున్నామని తెలిపింది. అర్మేనియన్ దళాలు అజర్బైజాన్ సైనిక స్థానాలపై బాంబులు వేసి కాల్పులు జరిపాయని పేర్కొంది.
అజర్బైజాన్లో భాగమైన నాగోర్నో-కరాబాఖ్పై దశాబ్దాల నాటి వివాదంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఉన్నాయి. అయితే 1994లో అక్కడ వేర్పాటువాద యుద్ధం ముగిసినప్పటి నుండి ఆర్మేనియా మద్దతు ఉన్న జాతి అర్మేనియన్ దళాల నియంత్రణలో ఉంది. అజర్బైజాన్ 2020లో ఆరు వారాల యుద్ధంలో నాగోర్నో-కరాబాఖ్ను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో 6,600 మందికి పైగా మరణించారు. చివరకు రష్యా మధ్యవర్తిత్వ శాంతి ఒప్పందంతో ముగిసింది. ఒప్పందం ప్రకారం శాంతి పరిరక్షకులుగా పనిచేయడానికి మాస్కో దాదాపు 2,000 మంది సైనికులను ఈ ప్రాంతంలో మోహరించింది.