దర్వాజ-హైదరాబాద్
Coronavirus: ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది. దీనికి కోవిడ్-19 కొత్త వేరియంట్లే కారణంగా పరిశోధకులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్ లో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. భారత్ లో సోమవారం 2,541 కరోనావైరస్ కేసులు మరియు 30 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 16,522గా ఉన్నాయి. తాజాగా నమోదైన కొత్త కేసులు, మరణాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 5,22,223 మంది చనిపోగా.. కరోనా వైరస్ కేసులు 4,30,60,086కు పెరిగాయి.
భారతదేశంలో మొత్తం యాక్టివ్ కోవిడ్ కేసులు 16,522కి పెరిగాయి. ఇది మొత్తం కేసుల్లో 0.04% ఉంది. గత 24 గంటల్లో 1,862 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. మొత్తంగా 4,25,21,341 మంది రోగులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి.