Breaking
Sun. Jun 29th, 2025

Coronavirus vaccin: 18-59 మధ్య వయస్సు వారికి ఉచితంగానే క‌రోనా బూస్ట‌ర్ డోసులు

Coronavirus, Covid-19, India, Omicron, ఒమిక్రాన్‌, కోవిడ్‌19, క‌రోనా వైర‌స్‌, భార‌త్‌, వ్యాక్సినేష‌న్‌, టీకాలు, పిల్ల‌లు, 18-59 age group, Booster shots, బూస్ట‌ర్ డోసులు, government vaccination centre , ప్ర‌భుత్వ వ్యాక్సిన్ కేంద్రాలు, independence, స్వాతంత్య్రం, vaccin, Anurag Thakur , అనురాగ్ ఠాకూర్ , Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు,

దర్వాజ-హైదరాబాద్

Covid-19 Booster shots: క‌రోనా బూస్ట‌ర్ డోసుల అంద‌జేత‌పై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 18 ఏండ్లు పైబ‌డిన వారికి ఉచితంగానే క‌రోనా బూస్ట‌ర్ డోసులు ఉచితంగా అందిస్తామ‌ని తెలిపింది. జూలై 15 నుంచి 75 రోజుల స్పెషల్ డ్రైవ్ కింద ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్‌లో 18-59 ఏళ్ల మధ్య ఉన్నవారు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామ‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధ‌వారం నాడు వెల్ల‌డించారు. ‘భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ క్ర‌మంలోనే కోవిడ్‌-19 బూస్ట‌ర్ డోసులు ఉచితంగా ఇవ్వ‌డానికి నిర్ణ‌యం తీసుకున్నాం’ అని తెలిపారు. ప్ర‌భుత్వ టీకా కేంద్రాల్లో బూస్ట‌ర్ డోసులు ఉచితంగా అందిస్తామ‌న్నారు.

ఇప్పటి వరకు, 18-59 మధ్య వయస్సు గల 77 కోట్ల జనాభాలో 1 శాతం కంటే తక్కువ మంది ముందు జాగ్రత్త మోతాదును (బూస్ట‌ర్ డోసు) అందించారు. అయితే, 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 16 కోట్ల మంది అర్హులైన జనాభాలో 26 శాతం మంది అలాగే ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులు బూస్టర్ డోస్ అందుకున్నారని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Related Post