Coronavirus: పెరుగుతున్న కరోనా మరణాలు, కొత్త కేసులు..
దర్వాజ-న్యూఢిల్లీ
COVID-19 Updates: భారత్లో కరోనా వైరస్ కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది. భారత్ లో గత 24 గంటల్లో18,840 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 43 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,36,04,394 కు చేరింది. కరోనా మరణాలు 5,25,386కు పెరిగాయి.
కొత్తగా 6,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,29,53,980కి పెరిగింది. రికవరీ రేటు సుమారు 98.51 శాతంగా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం.. జూలై 8 వరకు 86,61,77,937 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. అలాగే,198.7 కోట్ల కరోనా వైరస్ టీకా డోసులను పంపిణీ చేశారు.
Share this content: