దర్వాజ-క్రీడలు
Mirabai Chanu: టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి దేశాన్ని గర్వించేలా చేసిన వెయిట్ లిప్టర్ మీరాబాయి చాను.. కామన్వెల్త్ గేమ్స్-2022లో 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. మొత్తంగా ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు భారత్ కు మూడు మెడల్స్ లభించాయి. ఇందులో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించగా.. వెయిట్లిఫ్టింగ్లో సంకేత్ సర్గర్ రజతం, గురురాజ్ పూజారి కాంస్యం పతకాలు సాధించారు.
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 లో మహిళల 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో దేశానికి తొలి బంగారు పతకాన్ని మీరాబాయి చాను సాధించిపెట్టింది. నాలుగు సంవత్సరాల క్రితం గోల్డ్ కోస్ట్లో స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను, 201 కేజీలు (స్నాచ్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 113 కేజీలు) ఎత్తి విజయవంతంగా టైటిల్ను కాపాడుకోవడమే కాకుండా, సరికొత్త రికార్డును నెలకొల్పింది. మొదటి ప్రయత్నంలోనే 84 కిలోల బరువును విజయవంతంగా ఎత్తింది. తర్వాతి స్నాచ్ ప్రయత్నంలో చాను మరో 4 కిలోలు జోడించి 88కిలోలను సులభంగా ఎత్తి, తన వ్యక్తిగత అత్యుత్తమ స్థాయికి దూసుకెళ్లి CWG రికార్డును నెలకొల్పింది.
గోల్డ్ మెడల్ సాధించిన మీరాబాయి చానుకు ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
The exceptional @mirabai_chanu makes India proud once again! Every Indian is delighted that she’s won a Gold and set a new Commonwealth record at the Birmingham Games. Her success inspires several Indians, especially budding athletes. pic.twitter.com/e1vtmKnD65
— Narendra Modi (@narendramodi) July 30, 2022