దర్వాజ-న్యూఢిల్లీ
Commonwealth Games 2022: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 62 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ విజయం సాధించారు. కెనడాకు చెందిన అనా గోడినెజ్ గొంజాలెస్ను ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. రియో ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అయిన సాక్షి మాలిక్.. నాలుగేళ్ల క్రితం గోల్డ్కోస్ట్లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి ఆమె బంగారు పతకంతో ఛాంపియన్ గా నిలిచింది. అలాగే, అన్షు మాలిక్ రజతం, బజరంగ్ పునియా స్వర్ణం సాధించిన తర్వాత కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి మొత్తం 22వ పతకాన్ని అందించింది. గతంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో రజత పతకాన్ని గెలుచుకుంది. దోహాలో జరిగిన 2015 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించింది.
SAKSHI WINS GOLD 🤩🤩
— SAI Media (@Media_SAI) August 5, 2022
Rio Olympics 🥉medalist @SakshiMalik (W-62kg) upgrades her 2018 CWG 🥉 to🥇 at @birminghamcg22 🔥
What a Comeback 🤯 VICTORY BY FALL 🔥
With this Sakshi wins her 3rd consecutive medal at #CommonwealthGames 🥇🥉🥈
Medal in all 3️⃣colors 😇#Cheer4India
1/1 pic.twitter.com/vsRqbhh890