Breaking
Sat. Jun 28th, 2025

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022లో గోల్డ్ మెడల్ గెలిచిన సాక్షి మాలిక్

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, CWG 2022, Sakshi Malik, gold medal, India, wrestling, Commonwealth Games 2022, Birmingham, సీడ‌బ్ల్యూజీ 2022, సాక్షి మాలిక్, బంగారు పతకం, భారతదేశం, రెజ్లింగ్, కామన్వెల్త్ గేమ్స్ 2022, బర్మింగ్‌హామ్,

దర్వాజ-న్యూఢిల్లీ

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదిక‌గా జ‌రుగుతున్న‌ కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల 62 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో భార‌త రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ విజ‌యం సాధించారు. కెనడాకు చెందిన అనా గోడినెజ్ గొంజాలెస్‌ను ఓడించి గోల్డ్ మెడ‌ల్ గెలుచుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన సాక్షి మాలిక్.. నాలుగేళ్ల క్రితం గోల్డ్‌కోస్ట్‌లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈసారి ఆమె బంగారు ప‌త‌కంతో ఛాంపియ‌న్ గా నిలిచింది. అలాగే, అన్షు మాలిక్ రజతం, బజరంగ్ పునియా స్వర్ణం సాధించిన త‌ర్వాత కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశానికి మొత్తం 22వ పతకాన్ని అందించింది. గతంలో 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. దోహాలో జరిగిన 2015 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది.

Related Post