Breaking
Mon. Jun 30th, 2025

Arvind Kejriwal: బీజేపీ వ్య‌తిరేక కూటమిలో చేరిక‌పై కేజ్రీవాల్ కీల‌క వ్యాఖ్య‌లు

Delhi, AAP, Arvind Kejriwal, Currency, Lakshmi Devi, Ganesha, India, Economy,ఢిల్లీ, ఆప్, అరవింద్ కేజ్రీవాల్, కరెన్సీ, లక్ష్మీదేవి, గణేషుడు, భారత్, ఆర్థిక వ్యవస్థ, Hindu deities,

దర్వాజ-న్యూఢిల్లీ

AAP: బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు ఇంకా ప్రణాళిక లేదనే సంకేతాలు పంపారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత‌ అరవింద్ కేజ్రీవాల్. రానున్న గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై దృష్టి సారించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. వివ‌రాల్లోకెళ్తే.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జరిగిన ఆప్ కు ఎన్నికైన ప్రతినిధుల మొదటి జాతీయ సమావేశంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2024 సార్వత్రిక ఎన్నికలకు పిచ్ ను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన‌ట్టు తెలిపారు. బీజేపీని ఎదుర్కోవటానికి ప్రతిపక్ష కూటమిలో చేరే ప్ర‌ణాళిక‌లు ఇంకా లేవ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అలాగే, AAP “మేక్ ఇండియా నంబర్ 1” ప్రచారం ద్వారా “భారతదేశంలోని 130 కోట్ల మంది పౌరుల కూటమి” నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేజ్రీవాల్ పార్టీ సభ్యులను కోరారు. గుజరాత్‌లో ఆప్‌కి పెరుగుతున్న ఆదరణ బీజేపీని కుదిపేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేజీకి గుజ‌రాత్ ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అన్నారు. త‌మ శాసనసభ్యులను అవినీతికి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఇరికించే కుట్ర‌కు పాల్ప‌డుతూ.. త‌మ‌కు అణిచివేసేందుకు బీజేపీ పూనుకుంటోందని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న‌.. ప్ర‌జా సంక్షేమాల‌పై ఉచితాలకు అనుకూలంగా AAP వాదనలను సమర్థించారు.

అలాగే, “మేక్ ఇండియా నంబర్ 1” విజన్‌కు కట్టుబడి తీర్మానాన్ని ఆమోదించారు. “ఇది ఏ పార్టీ లక్ష్యం కాదు. బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ప్రజలు ఏకతాటిపైకి రావాలి. భారతదేశం ప్రపంచాన్ని నడిపించగలదు.. 130 కోట్ల మంది భారతీయులు కలిసి పగ్గాలు చేపట్టాలి” అని తీర్మానంలో పేర్కొంది. తమ ఎన్నికైన ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. “ఆపరేషన్ లోటస్‌కు బాధ్యులు దేశ ద్రోహులు. వారిపై దేశద్రోహ నేరం మోపి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటామని ప్రజలు నన్ను అడుగుతున్నారు. 130 కోట్ల మంది భారతీయులతో కూటమిగా ఏర్పడే రోజు మనల్ని ఎవరూ అడ్డుకోలేరని నాకు మాత్రమే తెలుసు” అని కేజ్రీవాల్ అన్నారు.

Related Post