దర్వాజ-అహ్మదాబాద్
Pakistani boat seized with drugs: గుజరాత్ తీరానికి సమీపంలో 200 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ తో కూడిన పాకిస్థాన్ బోటును ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నాయి. వివరాల్లోకెళ్తే.. భారత తీర రక్షక దళం, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) సంయుక్త ఆపరేషన్లో బుధవారం భారత జలాల లోపల ఆరు మైళ్ల దూరంలో ఒక పాకిస్తానీ పడవను పట్టుకున్నాయని ఇండియా టూడే నివేదించింది. బోటులో 40 కిలోల డ్రగ్స్ ఉందనీ, వాటి దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న కోస్ట్గార్డ్కు చెందిన రెండు ఫాస్ట్ అటాక్ బోట్లు గుజరాత్లోని జఖౌ తీరానికి 33 నాటికల్ మైళ్ల దూరంలో పాకిస్థాన్ బోట్ అల్ తయాసాను పట్టుకున్నాయి. తదుపరి విచారణ కోసం పడవతో పాటు ఆరుగురు సిబ్బందిని జాఖౌకు తీసుకువస్తున్నారు. కోస్ట్ గార్డ్, రాష్ట్ర ATS గతంలో కూడా గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రయత్నాలను విఫలం చేశాయి. అక్టోబర్ 2021లో, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుండి 2,988 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 21,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇది గుజరాత్ తీరానికి సమీపంలో జరిగిన అతిపెద్ద డ్రగ్స్ రవాణాలో ఒకటిగా ఉంది. గత నెలలో, గుజరాత్లోని కచ్ జిల్లాలోని ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న క్రీక్ నుండి సరిహద్దు భద్రతా దళం (BSF) రెండు పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది.