Breaking
Sat. Jun 28th, 2025

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మ‌రోసారి నోటీసులిచ్చిన ఈడీ..

Rahul Gandhi, BJP, Hindustan, Bharat Jodo Yatra, Congress, రాహుల్ గాంధీ, బీజేపీ, హిందుస్తాన్, భారత్ జోడో యాత్ర, కాంగ్రెస్,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
National Herald case: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజాగా సమన్లు ​​జారీ చేసింది. జూన్ 13న ED ముందు హాజరు కావాలని రాహుల్‌ గాంధీని తాజాగా కోరింది. అంత‌కు ముందు జూన్ 2న హాజరు కావాల్సిందిగా ఈడీ పేర్కొంది. అయితే, ఆయ‌న విదేశాల్లో ఉన్న నేప‌థ్యంలో తాజాగా ఈడీ ప్రెష్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. “రాహుల్ గాంధీ జూన్ 5 నాటికి ఇంటికి తిరిగి వస్తారని భావిస్తున్నారు, ఆ తర్వాత మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి ED నుండి మరొక తేదీని కోరతారు” అని కాంగ్రెస్ వర్గాలు ముందుగా వార్తా సంస్థ ANIకి చెప్పిన‌ట్టు నివేదిక‌లు పేర్కొన్నాయి.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీతో పాటు ఆయన తల్లి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా జూన్ 8న ఈడీ సమన్లు ​​జారీ చేసింది. సోనియాగాంధీకి కోవిడ్-19 పాజిటివ్ వ‌చ్చింది. ఈ తేదీలు కూడా మారే అవ‌కాశ‌ముంది. ఈక్విటీ లావాదేవీలో ప్రత్యేకించి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసును పరిగణనలోకి తీసుకున్న తర్వాత ED 2016 నుండి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ హోల్డింగ్ కంపెనీ మరియు కొంతమంది కాంగ్రెస్ నాయకులపై విచారణ జరుపుతోంది.

విచారణలో భాగంగా రాహుల్, సోనియా గాంధీల కంటే ముందు కేంద్ర ఏజెన్సీ ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ బన్సాల్, మల్లికార్జున్ ఖర్గేలను ప్రశ్నించింది. ఎలాంటి మోసం జరగలేదని కాంగ్రెస్ పేర్కొంటూ.. 2015లో ఈ కేసును మూసివేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించింది. అయితే, రాజ‌కీయ క‌క్ష‌తోనే బీజేపీ ప్ర‌భుత్వం ఈ కేసును తిరిగి తెరుస్తోంద‌ని కాంగ్రెస్‌ ఆరోపించింది. . రాహుల్, సోనియాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ పిరికిపంద కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ ఘాటుగా వ్యాఖ్యానించింది.

Related Post