Breaking
Sat. Jun 28th, 2025

స్టేజీపైనే కుప్ప‌కూలిన ప్ర‌ముఖ సింగ‌ర్ క‌న్నుమూత

Odia singer, Murali Mohapatra , Durga Puja , Koraput district, Odisha, ఒడియా గాయకుడు, మురళీ మోహపాత్ర , దుర్గా పూజ , కోరాపుట్ జిల్లా, ఒడిశా,

ద‌ర్వాజ‌-భువ‌నేశ్వ‌ర్

Odia singer Murali Mohapatra: ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గా పూజ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తుండగా కుప్పకూలి మరణించారు. అస్వస్థతకు గురైన మోహపాత్ర, జెయోర్ పట్టణంలో నాలుగు పాటలు పాడిన తర్వాత అకస్మాత్తుగా వేదికపై కుర్చీపై ప‌డిపోయారు. అక్కడున్న‌వారు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై ఆసుపత్రికి తీసుకెళ్లగా, మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయిన‌ట్టు వైద్యులు ప్ర‌క‌టించారు. కాగా, ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని ఆయన సోదరుడు బిభూతి ప్రసాద్ మోహపాత్ర తెలిపారు.

జైపూర్ పట్టణంలోని రాజనహర్ పూజా మండపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో మోహపాత్ర ప్రదర్శన ఇస్తుండగా వేదికపై కుప్పకూలిపోయాడు. రెండు పాటలు పాడిన త‌ర్వాత ఆయ‌న వేదికపై కుర్చీపై కూర్చుని ఇతర గాయకులతో మాట్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఒక్క‌సారిగి కుప్పకూలిపోయాడు. మురళి మోహపాత్ర మృతి వార్త తెలియగానే ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయ‌న‌ను జైపూర్‌కి చెందిన అక్షయ మొహంతి అని కూడా పిలుస్తారు. మురళి మోహ‌పాత్ర గాయ‌కుడుగా మార‌క‌ముందు.. జైపూర్ సబ్-కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేశారు.

మురళీ మోహపాత్ర మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. “ప్రముఖ గాయకుడు మురళీ మోహపాత్ర మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన మధురమైన గాత్రం శ్రోతల హృదయాలను ఎప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఒడియాలోని ట్విట్టర్ పోస్ట్‌లో పట్నాయక్ పేర్కొన్నారు.

Related Post