Breaking
Sat. Jun 28th, 2025

దేశంలో పెట్రో మంట‌లు.. వరుస‌గా 12వ రోజు పెరిగిన ధ‌ర‌లు

Fuel prices hiked for 12th straight day
Fuel prices hiked for 12th straight day

– మునుపెన్నడూ లేని విధంగా రికార్డు ధరలు

– వాహనదారుల గగ్గోలు.. పన్ను పోటు తగ్గించాలని ప్ర‌తిప‌క్షాల డిమాండ్

– దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.97.00, డీజిల్ ధ‌ర రూ.88.05

దేశంలో చ‌మురు మంట‌లు ఆగ‌డం లేదు. రికార్డులు స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతూ వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వరుస పెట్టి ధరలు నిత్యం పెరుగుతుండగంలో వనియోగదారులు బెంబెలెత్తిపోతున్నారు. తాజాగా శనివారం కూడా దేశంలో చమురు ధరలు పెరిగాయి. దీంతో వరుసగా 12వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి.

దేశవ్యాప్తంగా శనివారం నాడు లీటరు పెట్రోల్ ధర 35-40 పైస‌లు, డీజిల్ పై 30-40 పైస‌లు పెరిగింది. తాజాగా చ‌మురు కంపెనీలు తీసుకున్న ధ‌ర‌ల పెంపు నిర్ణ‌యంతో కొత్త రికార్డులు న‌మోద‌వుతున్నాయి. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో ప్రస్తుతం లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.97.00, డీజిల్ ధ‌ర రూ.88.05ల‌కు చేరింది. అలాగే, దేశంలోని వివిధ మెట్రో న‌గ‌రాల్లో ఈ ప్ర‌స్తుతం కింది విధంగా చ‌మురు ధ‌ర‌లు ఉన్నాయి.

నగరాలుపెట్రోల్ లీటరు ధర రూ.డీజిల్ ధర రూ.
ఢిల్లీ 90.5880.97
ముంబయి97.0088.05
చెన్నై 92.5985.98
బెంగళూరు93.6185.84
కోల్ కతా97.7884.56
హైదరాబాద్ 94.1888.31
విజయవాడ97.0190.58

కాగా, గత రికార్డులను తిరగ రాస్తూ ఇంధన ధరలు పెరుగుతుండటంపై వాహనదారులు తీవ్ర ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లే వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి తోడు నిత్యాస‌రాల ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్య ప్ర‌జానీకం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెబుతున్నారు. ఇటీవ‌లే క‌రోనా సృష్టించిన ఆర్థిక‌, ఆరోగ్య సంక్షోభం పూర్తిగా తొల‌గిపోక‌ముందే మ‌ళ్లీ.. ఇలా నిత్యావ‌స‌రంలో ఉప‌యోగించుకునే వాటి ధ‌ర‌లు పెర‌గ‌డం త‌మ‌ను మ‌రింత కృంగ‌దీస్తున్న‌ద‌ని వాపోతున్నారు.

ఇంధ‌న ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెర‌గ‌డంతో పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దులో సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న రైతు ఉద్య‌మం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై అన్న‌దాత‌ల‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. చ‌మురుపై విధిస్తున్న ప‌న్నును వెంటనే త‌గ్గించి.. పెట్రో భారాన్ని కొంత‌మేర ప్ర‌జ‌ల‌కు త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వ‌ర్షాలు!

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

షుగ‌ర్ తో జ‌ర పైలం!

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

Related Post