gang rape: క్లాస్లు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బాలికపై ఐదుగురు విద్యార్థుల సామూహిక అత్యాచారం..
దర్వాజ-పాట్నా
Bihar girl gang-raped: బీహార్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోచింగ్ క్లాసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న బాలికపై ఆదే సెంటర్ కు చెందిన ఐదురుగు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీహార్లోని జాముయ్ జిల్లాలో కోచింగ్ తరగతులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, అదే కోచింగ్ సెంటర్లో చదువుకున్న ఐదుగురు విద్యార్థులు బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
బాలిక కోచింగ్ సెంటర్ క్లాసుల ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, నిందితులైన ఐదుగురు అబ్బాయిలు ఆమెను బలవంతంగా సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు వారిని వెతుకుతున్నారు. కాగా, ఇదివరకు సదరు బాలికపట్ల నిందితులు అసభ్యంగా ప్రవర్తించారనీ, ఇదే విషయాన్ని కోచింగ్ సెంటర్ వారికి చెప్పామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, బాలికకు ఇక ఇబ్బంది ఉండదని హామీ ఇవ్వడంతో, కుటుంబ సభ్యులు ఆమెను అదే కోచింగ్ సెంటర్కు పంపుతున్నారు. ఇక ఫిర్యాదుపై కోపోద్రిక్తులైన నిందితులు కోచింగ్ సెంటర్ నుంచి ఒంటరిగా వస్తున్న బాధిత బాలికను నిర్మానూష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.
Share this content: