YouTube videos: 10 యూట్యూబ్ ఛానెళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న కేంద్రం

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, YouTube channels, Pakistan, Ministry of Information and Broadcasting, blocked, India, యూట్యూబ్ ఛానెళ్లు, పాకిస్తాన్, కేంద్ర‌ సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ, బ్లాక్, భారతదేశం,

దర్వాజ-న్యూఢిల్లీ

YouTube videos: సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ – యూట్యూబ్ లోని 10 ఛానెల్‌ల నుండి 45 వీడియోలను బ్లాక్ చేయాలని ఆదేశించింది. బ్లాక్ చేయబడిన వీడియోలకు 1 కోటి 30 లక్షల వీక్షణలు ఉన్నాయి. బ్లాక్ చేయబడిన వాటిలో యూట్యూబర్ ధృవ్ రాథీ వీడియో కూడా ఉంది. నిఘా వర్గాల సమాచారం మేరకు సెప్టెంబర్ 23న ఈ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత నోటీసులు పంపబడ్డాయి.

“దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ, తప్పుడు సమాచారం ద్వారా స్నేహపూర్వక దేశాలతో సంబంధాలను విధ్వంసం చేయడానికి ప్రయత్నించినందుకు సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ 10 యూట్యూబ్ ఛానెళ్ల లోని ప‌లు వీడియోల‌ను నిషేధించింది. సస్పెండ్ చేసింది. ఇది దేశ ప్రయోజనాల కోసం ఇంతకు ముందు జరిగింది, భవిష్యత్తులో కూడా ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాం” అని I&B మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021లోని నిబంధనల ప్రకారం సంబంధిత వీడియోలను బ్లాక్ చేయడానికి 23.09.2022న ఆదేశాలు జారీ చేయబడ్డాయి” అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వీడియోల కంటెంట్‌లో మతపరమైన వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యంతో ఫేక్ న్యూస్, మార్ఫింగ్ చేసిన వీడియోలు ఉన్నాయ‌ని తెలిపింది.

కొన్ని వర్గాల మతపరమైన హక్కులను ప్రభుత్వం తొలగించింది, మతపరమైన సంఘాలపై హింసాత్మక బెదిరింపులు, భారతదేశంలో అంతర్యుద్ధం ప్రకటించడం సహా ఇతరుల వంటి తప్పుడు వాదనలు ఉదాహరణలుగా ఉన్నాయి. ఇటువంటి వీడియోలు దేశంలో మత సామరస్యాన్ని, ప్రజా శాంతికి విఘాతం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కనుగొనబడింది. మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన కొన్ని వీడియోలు అగ్నిపథ్ పథకం, భారత సాయుధ దళాలు, భారత జాతీయ భద్రతా యంత్రాంగం, కాశ్మీర్ అంశం స‌హా ఇతర సమస్యలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించబడుతున్నాయ‌ని పేర్కొంది.

Related Post