దర్వాజ-గుంటూరు
TDP Sankranthi Kanuka: గుంటూరులోని వికాస్ నగర్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంక్రాంతి కానుక పంపిణీ సందర్భంగా ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు.
తన ప్రసంగం ముగిసిన తరువాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుక పంపిణీ ప్రారంభించిన ప్రాంగణం నుండి బయలుదేరారు. సంక్రాంతి కానుకలు సేకరించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు కౌంటర్ల వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుంది.
తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించిన నలుగురు మహిళల్లో ఇద్దరు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh | Three people died and several were injured during a public meeting held by TDP leader N Chandrababu Naidu in Guntur district: Arif Hafeez, SP Guntur
— ANI (@ANI) January 1, 2023
8 people died recently in a stampede in Nellore during a public meeting by N Chandrababu Naidu. pic.twitter.com/9N1aU1gcjd