Breaking
Sat. Jun 28th, 2025

హైతీ భూకంపం.. 1300కు చేరిన మ‌ర‌ణాలు

Haiti earthquake
Haiti earthquake

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Haiti earthquake: క‌రేబియ‌న్ దేశం హైతీలో సంభ‌వించిన భారీ భూకంపంలో మ‌ర‌ణాల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంది. భూకంపం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని అక్క‌డి స్థానిక మీడియా పేర్కొంది. శ‌నివారం ఈశాన్య హైతీలో రిక్ట‌ర్ స్కేల్ పై 7.2 తీవ్ర‌త‌తో భూకంపం సంభ‌వించింది. దీని కార‌ణంగా అనేక భ‌వ‌నాలు, ఇండ్లు కూలిపోయాయి. వేలాది మంది శిథిళాల కింది చిక్కుకుపోయారు.

ప్ర‌స్తుతం స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ఎక్క‌డ చూసినా హృద‌య విదార‌క దృశ్యాలే క‌నిపిస్తున్నాయి. ఆస్తి న‌ష్టంతో ఆ దేశం ఇప్ప‌ట్లో కోలుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. గ‌తంలో 2010లో సంభవించిన భూకంపానికి దేశ‌రాజ‌ధాని పోర్ట్ వో ప్రిన్స్ స‌హా అనేక సమీప నగరాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. ఏకంగా రెండు ల‌క్ష‌ల‌కు మందికి పైగా మ‌ర‌ణించారు. మ‌రో 3 ల‌క్ష‌ల మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 15లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. దీంతో అప్ప‌టి నుంచి హైతీ పేద‌రికంలో కొట్టుమిట్టాడుతోంది.

Related Post