దర్వాజ-భువనేశ్వర్
200 Shops Gutted In Massive Fire In Keonjhar: డిశాలోని కియోంఝర్ లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 200 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనీ, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని కియోంఝర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 200కు పైగా దుకాణాలు కాలి బూడిదయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకున్నారు. మంటలు పెద్ద మొత్తంలో ఉండటంతో పాటు క్రమంగా పెరగడం వల్ల తగినంత నీటి సరఫరా లేకపోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు పడ్డారని సమాచారం.
ఈ అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్నారు.
Read More…
IPL 2023: తొలిపోరుకు అంతా సిద్ధం.. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
కరోనా విజృంభణ: మళ్లీ మూడు వేలు దాటిన కోవిడ్-19 కొత్త కేసులు
IPL 2023లో భారీ సిక్సర్.. 100 మీటర్లు దాటిన ఫస్ట్ సిక్స్ ఎవరు కొట్టారంటే.. ?
తెలంగాణ కంటి వెలుగు.. ఇప్పటివరకు దాదాపు కోటీ మందికి కంటి పరీక్షలు