Huzurabad By Poll : తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి నుంచి లీడ్లో ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. 9వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ భారీ అధిక్యం లభించింది. మొత్తం 5111 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు.