Huzurabad By Poll : 12వ రౌండ్లో ఈటల ఆధిక్యం
దర్వాజ-హుజురాబాద్
Huzurabad By Poll : తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి నుంచి లీడ్లో ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు. 12వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ భారీ అధిక్యం లభించింది. 12వ రౌండ్లో మొత్తం 5,523 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు.
ఇప్పటివరకు ఈటల రాజేందర్ కు మొత్తం 53,497 ఓట్లు పడ్డాయి. టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు 46,966 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బి.వెంకట్ 1571 ఓట్లు వచ్చాయి.
Share this content: