Breaking
Tue. Jun 24th, 2025

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

రోడ్డు ప్ర‌మాదం, ఓఆర్ఆర్, హైద‌రాబాద్, ఇద్ద‌రు మృతి, తెలంగాణ‌, నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు , Road accident, ORR, Hyderabad, two killed, Telangana, Nehru Outer Ring Road,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Road Accident: ఆంధ్ర‌ప్ర‌దేశ్-తెలంగాణ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీని ఢీకొట్టడంతో ఆరుగురి మృతి చెందారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ దుర్ఘ‌ట‌ట‌న‌లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు వార్తాసంస్థ పీటీఐ నివేదించింది. బాధితులు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని, తెలంగాణలోని భద్రాచలంలోని శ్రీరాముని ఆలయానికి తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Related Post